Bandla Ganesh : కమెడీయన్ నుండి నిర్మాతగా ఎదిగి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు బండ్ల గణేష్. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలోను లేదంటూ సోషల్ మీడియాలోను ఏం చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పేయడం వలన హాట్ టాపిక్ అవుతుంటాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు గానీ, వాటిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాయి.
`జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెబుతున్నా. దయజేసి ఎవరిని నమ్మోదు.. ఎవ్వరూ మనకు సహాయం చేయరు. ఎవరూ మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత మళ్లీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది . ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే, కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరినైనా నమ్మామా, మన గొంతు మనం కోసుకున్నట్టే. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి. మీ శక్తితో మీరు పోరాడండి, ఎంత పెద్దోదైనా గౌరవించండి, కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి` అంటూ బండ్ల గణేష్ హితభోద చేశాడు.
అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు కాని, ఆయనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుండటం గమనార్హం. నిన్ను వాడుకున్నది ఎవరు, `గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ వేయమంటే యాభై వేలు అడిగావ్ .., ఫ్యాన్స్ తో ఆడుకునేది ఇలానేనా? నీయంత వెర్రి పుష్పం ఎవరు ఉండరులే అని, నిన్ను ఎవరైనా వాడుకుంటారా అది సాధ్యమేనా? అంటూ పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.ఇక వైసీపీ ఫ్యాన్స్ కూడా ఈ డిస్కషన్లో పాల్గొని రచ్చ చేస్తున్నారు. పవన్, బాబులనే బండ్ల గణేష్ అన్నదని చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు పవన్ని ఆరాధ్య దైవంగా భావించిన బండ్ల గణేష్.. ఇటీవల ఆయనకు దూరంగా ఉంటున్నట్టు అర్ధమవుతుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…