Balakrishna : ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు టీడీపీ, వైసీపీ.అయితే ఇటీవల అసెంబ్లీలో బాలయ్య మీసం తిప్పి మాట్లాడడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు టిడిపిలో మీసం తిప్పాలని హితవు పలికారు. తండ్రికి కష్టకాలంలో సహాయ పడలేదన్న అపవాదు మీ సోదరుల పైన ఉందని, ఇప్పుడు ఆ అపవాదు తొలగించుకునే అవకాశం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. మీకు సరైన సమయం చేతిలో నుంచి జారిపోయిన పగ్గాలు తిరిగి తీసుకోండి నందమూరి వంశాన్ని నిరూపించుకోండి అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి ఇదే సరైన సమయమని, పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నాను అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. తాను చెప్పింది పాటించకపోతే అదః పాతాళానికి పడిపోతారని అంబటి పేర్కొన్నారు.దీనిపై తాజాగా బాలయ్య మండిపడ్డారు.నేను ముందు ఏమని అనలేదు.
నా ప్రొఫెషన్ని అవమానించాడు. ముందు ఏమని అనలేదు. ఆయనే నన్ను రెచ్చగొట్టాడు. అసలు సంబంధం లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు అంటూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై రోజా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.‘ఎప్పుడూ షూటింగ్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్లలో ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడడం, నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం, అసెంబ్లీకి రాకపోవడం.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నువ్వొచ్చి మీసం మెలేస్తే ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది? దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది? ఆ తర్వాత అచ్చెన్నాయుడు పాత్ర ఎంతుంది? అనేది స్పష్టంగా వివరిస్తారు. ప్రజా డబ్బును దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రోజా అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…