Brahmanandam : స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఎలాంటి ఫంక్షన్లో అయిన బ్రహ్మీ హాస్యంతో అదరగొడుతుంటాడు.ఇటీవల ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలలో కూడా పాల్గొన్న బ్రహ్మానందం సుమ నా దగ్గరికి రానక్కర్లేదు..నేను వెంటనే దిగి వెళ్తాను అంటూ పంచ్లు వేసాడు. అంతేకాదు ఏఎన్ఆర్ ని కూడా ఇమిటేట్ చేశాడు. ఇక కొద్ది రోజుల క్రితం తన కుమారుడి వివాహం గ్రాండ్గా జరిపించాడు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు.
సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి తర్వాత తన కుమారుడు, కోడలిని తీసుకొని తిరుమల వెళ్లారు బ్రహ్మానందం. ఆ సమయంలో ఫ్యాన్స్ ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు బ్రహ్మానందం నన్ను వదిలేయండి అన్నట్టు పంచ్ వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు గౌతమ్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. కానీ, సినిమాలపై పెద్దగా ఇష్టం లేకపోవడంతో సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారని సమాచారం. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిలయ్యారని తెలిసింది. ఇక హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించారు. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించిన బ్రహ్మా అడపాదడపా సందడి చేస్తున్నాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…