జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్నారు. తాజాగా జగన్ చేసిన అయిదేళ్ల పాలనే రాష్ట్రానికి పెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రానికి అనుకోని విపత్తు వచ్చిన వేళ ప్రజలను మానవత్వంతో ఆదుకోవాల్సిన విపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి మేన్ మేడ్ ఫ్లడ్ అనడం జగన్కు అలవాటయిపోయిందని మండిపడ్డారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం కంటే మేన్ మేడ్ డిజాస్టర్ మరోకటి ఉండదన్నారు.
ఊహించని రీతిలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇంత ఏడుపా అని ప్రశ్నించారు. జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్కు లేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కల్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. పిఠాపురంలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ కాలనీలు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని అన్నారు. ఎక్కడ కష్టమొచ్చినా జన సైనికులు ముందుంటున్నారని పేర్కొన్నారు.
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లా స్పందించే మనసు ఉండాలి కాని, పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారని విమర్శించారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షోమెన్ తప్ప.. లీడర్ అనిపించుకోలేరని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులను రూ.4కోట్లు వరద ప్రభావిత పంచాయతీలకు ఇవ్వడంతో పాటు రెండు రాష్ట్రాలకు రూ.2కోట్లు అందించారని గుర్తుచేశారు. ఏలేరు ఆధునికీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే.. వర్షాలు కురిశాయి కనుక పనులు చేయలేదని జగన్ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే దోరణిలో మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ హయాంలో బీమా సొమ్ములు ఎవరికీ ఇవ్వలేదని, క్షేత్రస్థాయిలో బీమా అందిన దాఖలాలు లేవన్నారు. జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అన్నారు మనోహర్.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…