Kadambari Jethwani : ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారడం మనం చూశాం. వైసీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్ అధికారులు కలిసి తనను వేధించారని, ఆటబొమ్మలా వాడుకుని.. అక్రమ కేసులు పెట్టారని జత్వానీ చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వైసీపీపై బురదజల్లేందుకు రెండు రోజులుగా టీడీపీ, పచ్చ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించింది. సూపర్ 6 హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పదోవ పట్టించేందుకు.. హనీట్రాప్ చేసే మహిళను తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతోందని పేర్కొంది.
అన్ని రాష్ట్రాల్లో నిందితురాలు అయిన జత్వానీ.. ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అవుతుందని ప్రశ్నించింది. బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయని.. పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీట్రాప్ కేసులు బుక్కయ్యాయని బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో ఆమెపై హానీట్రాప్ కేసులు ఉండగా.. ఏపీలో మాత్రం బాధితురాలిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది.
సూపర్-6 హామీలను అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీడీపీ, ఎల్లో మీడియా కలిసి.. హనీ ట్రాప్ చేసే మహిళను తెరపైకి తెచ్చి నాటకం ఆడుతోంది. ఆ బురదను వైయస్ఆర్ సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకి రుద్దడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది అని వారు ఆరోపించారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్ ఒక భాగం మాత్రమేనని… ఇందులో ఏపీకి చెందిన పలువురు ఐపీఎస్లు, ఒక ఐఏఎస్, మరికొందరు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి కాదంబరి జెత్వానీ శుక్రవారం ముంబై నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ పోలీసులను కలిసి తాను ఎదుర్కొన్న పరిణామాలను వివరించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…