YS Sharmila : వివేకా హ‌త్య విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ష‌ర్మిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

YS Sharmila : ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ష‌ర్మిళ కూడా ప్ర‌చారంలో దూసుకుపోతుంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజక వర్గంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన సోదరి సునీతారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తాను కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు రోజులే అయిందని, తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని చెప్పుకొచ్చిది. అవినాష్ రెడ్డిని మార్చాలన్న వైసీపీ ప్రయత్నాలు చూస్తుంటే… అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. సీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని మార్చబోతున్నారని, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు.

అవినాశ్ ను మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటే… వివేకాను అవినాశ్ హత్య చేశాడని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? సీబీఐ చెపుతున్నది నిజమే అని ఒప్పుకుంటున్నట్టేనా? అందుకే కడప స్థానం నుంచి అవినాశ్ ను మారుస్తున్నారా? అని ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారని సీఎం జగన్ ను షర్మిల ప్రశ్నించారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారు అని ఎందుకు మార్చాలని చూస్తున్నారన్నారు. దీనిపై కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని జగన్ ను ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లుగా హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడని, అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టిందని షర్మిల తెలిపారు.

YS Sharmila strong question to cm ys jagan about ys viveka
YS Sharmila

అవినాష్ రెడ్డి దోషి అని తెలిసినా సీబీఐ ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయిందని షర్మిల విమర్శ‌లు గుప్పించారు. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాన్నారు. అన్యాయం ఒక వైపు, అధర్మం ఒకవైపు, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, ఆ తాను 5 రోజులుగా కడపలో ప్రచారం చేస్తున్నానని, తమ ప్రచారానికి వైసిపీలో వణుకు పుడుతుందన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా,మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే… సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చిత్రీకరించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా చనిపోయినప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్… సీఎం అయిన తర్వాత మాట మార్చారని.. తాను సీబీఐ ఎంక్వైరీకి పోతే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని సునీతకు ఎందుకు చెప్పారో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago