YS Sharmila : గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకి తెరపడింది. వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో కలిపేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ప్రధాని వేదికపై ఖర్గే, రాహుల్తో పాటు వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఇక షర్మిళ ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్ననారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా షర్మిల అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత షర్మిళ మాట్లాడుతూ… వైఎస్ఆర్టిపిని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు నుంచి కాంగ్రెస్లో వైఎస్ఆర్టిపిని ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్న షర్మిల వైఎస్ఆర్ జీవితమంతా ఆ పార్టీ కోసమే పని చేశారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి కల అని తెలిపారు. తాను తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని వెల్లడించారు.“దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ జోడో యాత్ర ప్రజలతో నాలో కూడా విశ్వాసం నింపింది. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా. కెసిఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు.” అని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు.
ఇక ఇదిలా ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా స్టేజీపై ఓ ఆసక్కితర సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా వైఎస్ షర్మిల మెడలో కుండవా కప్పి మల్లిఖార్జున ఖర్గే ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె పక్కనే ఉన్న బ్రదర్ అనిల్ మెడలోనూ కండువా వేయబోయారు. ఇది గమనించిన అనిల్.. తనకు కండువా వద్దంటూ షర్మిలకు సైగ చేశారు. ఆ వెంటనే షర్మల కండువా కప్పబోతున్న ఖర్గేతో.. ఆయన మెడలో కండువా వద్దు అంటూ నవ్వుతూ చెప్పారు. దీంతో ఖర్గే ఆశ్చర్యపోయ్యారు. ‘ఇదేంటమ్మా కండువా కప్పుకుంటే ఏమైతది’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఖర్గే.. కండువాను పక్కను పెట్టారు. ఆ తర్వాత రాహుల్ షర్మిల మెడలో కండువా కప్పారు. మొత్తంగా షర్మిల.. జాయినింగ్ ఎపిసోడ్లో జరిగిన ఈ సీన్ వైరల్ అవుతోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…