YS Sharmila : షర్మిళ ఏపీలో తెగ సందడి చేస్తుంది. వైసీపీపై విరుచుకుపడుతూ తెగ హంగామా చేస్తుంది. అయితే జగన్ని విమర్శిస్తున్న షర్మిల..జగన్ రాజన్న వారసుడు కాదని పేర్కొంది. వైఎస్.. మాట మీద నిలబడే నాయకుడు.. జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు.. ఇచ్చిన ప్రతి మాటా తప్పిన జగన్, మాటకు కట్టుబడే వైఎ్సకు వారసుడెలా అవుతారు..’ అని ఆయన చెల్లెలు, పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని, జగనన్న రాజకీయ భవిష్యత్ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని.. వైసీపీని గెలిపించానని.. ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చాననని.. అయినా కనీసం కృతజ్ఞత లేదని దుయ్యబట్టారు. అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయారన్నారు.
ఇవాళ తనమీద, తన వ్యక్తిగత జీవితం మీద నానారకాలుగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడనని, తాను వైఎస్ బిడ్డనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 2014లో తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని.. కాంగ్రెస్ ఇచ్చే ఐదేళ్ల వ్యవధి సరిపోదని, పదేళ్లపాటు హోదాకావాలన్నారని.. పదిహేనేళ్లు కావాలని ఇదేచోట చంద్రబాబు కూడా అడిగారని.. బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోదీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది అన్యాయం.. పాపమని స్పష్టం చేశారు. ‘ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. లక్షల ఉద్యోగాలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా కల్పించి 90శాతం నిధులు ఇస్తామంది.
మోదీ ప్రభుత్వం నిధులివ్వలేదు. రాజధాని నిర్మాణానికి సహకారమివ్వలేదు. దక్షిణాదిన మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీయే. ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా? రాష్ట్ర ప్రజలను మోదీ కడుపులో పొడిచారు. అయినా జగనన్న, చంద్రబాబు బీజేపీకి బానిసలయ్యారు. మోదీ రాష్ట్రానికి హోదా ఇచ్చారని బానిసలయ్యారా? ప్రాజెక్టులిచ్చారని భజన చేస్తున్నారా? వీళ్లు బానిసలై.. ఆంధ్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందువల్లే ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతోంది. రాయలసీమలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో రూ.4,500 కోట్లు ఖర్చుచేసి.. 90శాతం పనులు పూర్తిచేస్తే, మిగిలిన పది శాతం పనులు పూర్తిచేయడం జగనన్నకు చేతకావడం లేదు అని షర్మిళ పేర్కొంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…