Yarlagadda Lakshmi Prasad : నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు నెక్లెస్రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ సోదరులు నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్-జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులకు సూచించడంతో వారు మరోమారు ఆలోచించకుండా తీసి రోడ్డున పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాలయ్య ప్రవర్తనపై నందమూరి ఎన్టీఆర్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తన ఏం బాగోలేదు అంటూ కామెంట్ చేశారు. అయితే ఎన్టీఆర్ విషయంలో బాలయ్య ప్రవర్తించిన విధానం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదని చెప్పారు. తారక్పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టమని యార్లగడ్డ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. సందర్భంగా యార్లగడ్డ నారా లోకేష్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ కూతురిని లోకేష్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని తాను చంద్రబాబును అడిగానని చెప్పారు. దీనిపై ఆయన సీరియస్గా స్పందిస్తూ.. ‘నాన్సెన్స్’ అని చంద్రబాబు తనతో అన్నారని తెలిపారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని ఆ సందర్భంగా ఆయన చెప్పారని వివరించారు. అయితే ఆ తర్వాత లోకేష్కి బాలకృష్ణ కూతురిని ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…