ఇటీవలి కాలంలో వైవాహిక బంధానికి వాల్యూ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలకి భార్య భర్తలు విడిపోవడం, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం వంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావిం చిన భార్య, ప్రియుడితో కలసి భర్తను హత్య చేసింది..మదనపల్లె పట్టణం రామిరెడ్డిలేఅవుట్లో నివాసముంటున్న వెంకటశివ, రమణమ్మ లు భార్యభర్తలు. వారి స్వగ్రామం కలకడ మండలం సింగన ఒడ్డుపల్లె. ఉపాధి నిమిత్తం ఏడాదన్నర క్రితం ఆకుటుంబం మదన పల్లెకు రాగా, ఈ దంపతులు టమెటా మార్కెట్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే రమణమ్మ మార్కెట్ యార్డ్లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నషేక్ బషీర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతనితో ఇంటి పక్కన ఉన్న గగన్ అనే 21 ఏళ్ల వ్యక్తితోను ఎఫైర్ నడుపుతుంది.
ఈ ఇద్దరు ప్రియులతో రమణమ్మ సహజీవనం చేస్తుండేది. ఏడాదిగా ఇది కొనసాగుగుతుండగా.. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన వెంకట శివ అతని భార్య గగన్లో కలిసి ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు. రమణమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు వెంకటశివ. గగన్ గురించి నిలదీశాడు. దీంతో రగిలిపోయిన రమణమ్మ, గగన్ ఇద్దరు కలిసి వెంకట శివ తలపై రోకలిబండతో కొట్టారు. అంతేకాకుండా గగన్ అక్క బిందుప్రియ సహాయంతో వెంకట శివ మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య రమణమ్మ .. తన భర్త మద్యం సేవించి కిందకు పడి తలకు బలమైన గాయం తగిలించుకొని ఇంటికి వచ్చాడని, ఎవరు కొట్టారో ఏమైందో తనకు తెలియదని స్టోరీ అల్లింది.
ఆటోలో భర్త మృతదేహాన్ని స్వగ్రామం సింగనొడ్డుపల్లెకు తీసుకెళ్లింది. అంతలో తల, మెడపై గాయాలు ఉండటాన్ని గమనించి, రమణమ్మను ప్రశ్నించారు. తనదైన శైలిలో భర్త అన్న వెంకటరమణ ఆమెను నిలదీయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబీకు లు కలకడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మదనపల్లె పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ మహబూబ్ బాషా..సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రమణమ్మను పోలీసులు విచారించగా..అసలు నిజం బయటపడింది. రమణమ్మ చెప్పిన విషయాలు చూస్తే పోలీసులే అవాక్కైనట్లు తెలిపారు. 20 గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు రమణమ్మ, గగన్, బిందుప్రియ లను అరెస్టు చేశారు. షేక్ బషీర్ భాష పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి కేశప్ప చెప్పారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…