Actress Pragathi : ఒకప్పుడు హీరోయిన్గా నటించి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సత్తా చాటుతుంది ప్రగతి. అమ్మగా, అక్కగా, తల్లిగా ఇలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అలరిస్తుంది. ముఖ్యంగా జిమ్ వేర్లో తను జిమ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలని షేర్ చేస్తూ అందరి అటెన్షన్ తనపై పడేలా చేస్తుంది. ఏ విషయాన్నైన తన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రగతి. రీసెంట్గా ఆమె నిర్మాతని రెండో పెళ్లి చేసుకోబోతుందని దారుణంగా ప్రచారాలు సాగాయి. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె అంగీకరించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రగతి స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు.
నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ సాక్షి వంటి ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు (సాక్షి) ఒక సంస్థను నడుపుతున్నారు… అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు… మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు… మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను. నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం.
ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా సాక్షి వంటి ప్రముఖ మీడియా సంస్థను దిగజార్చకండి. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం కచ్చితంగా అనైతికం” అంటూ ప్రగతి తీవ్ర స్వరంతో ఆ పత్రికపై నిప్పులు చెరిగింది. మొత్తానికి మహిళల వ్యక్తిగత జీవితాలపై నిందలేయడంలో గాసిప్ సైట్ గా అందరి చీత్కారాలు పొందింది సాక్షి. గతంలో గాయని సునీత విషయంలో చేసిన ప్రచారంతో కేసులయ్యాయి. ఇటీవల యాక్టర్ స్వాతి రెడ్డి కూడా.. తాను ఎంత మానసిక క్షోభను అనుభవించారో చెప్పారు. అలా చేయడం తమకు ఎంతో ఇష్టం అనుకున్నారేమో కానీ సాక్షి కూడా రంగంలోకి దిగిపోయి ఇప్పుడు ప్రగతిపై తప్పుడు వార్తలు రాసారు. దీంతో ఆమె చాలా ఫైర్ అయింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…