Chandra Babu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా ఆయనకి మధ్యంతర బెయిల్ లభించగా, మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలై రోడ్డుమార్గంలో సుమారు 13 గంటలపాటు ప్రయాణించి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అమరావతి రైతులు బాబు కు ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు గుమ్మడికాయతో చంద్రబాబుకు దిష్టి తీశారు.
ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగాలకు లోనయ్యారు. కేసుల్లో అక్రమంగా ఇరికించారంటూ బాబును వారంతా ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలన్నారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు.. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు. అనంతరం చంద్రబాబు టీడీపీ నేతల్ని కలిశారు.. వారిని ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును చూసి పలువురు నేతలు భావోద్వేగానికి గురయ్యారు.
ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు కూడా చేశారు. అయితే చంద్రబాబుకి దారిపొడవునా 45ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతి చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగడంపై చంద్రబాబు పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే జాప్యం జరుగుతోందని వారిని ఒత్తిడి చేస్తే శాంతిభద్రత సమస్య వస్తుందని పోలీసులు తెలిపారని సమాచారం. రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత లాలాచెరువు, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం, పెరవలి, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…