Nagababu : ఎట్టకేలకి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లిగా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచారు. దాంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. ముహూర్తం ప్రకారం సాయంత్రం ఏడు గంటల 18 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. చాలా లావిష్ మ్యానర్లో, గ్రాండియర్గా వరుణ్లవ్ పెళ్లి వేడుక జరగడం విశేషం. నాగబాబు తనయుడి వివాహ వేడుకకు వారి సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్తో పాటు రాంచరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. లావణ్య త్రిపాఠి కుటుంసభ్యులు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఇటలీలో మూడు రోజులపాటు వరుణ్లవ్ మ్యారేజ్ వేడుక నిర్వహించారు. అక్టోబర్ 30 కాక్టెయిల్ పార్టీ, 31న హల్దీ, మెహందీ వేడుక నిర్వహించారు. నవంబర్ 1 న గ్రాండ్గా పెళ్లి వేడుక చేశారు. వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఇటలీలో జరిగింది. మొదటిసారి ఈ జంట ఇటలీలో తమ లవ్ ప్రపోజ్ చేసుకున్న నేపథ్యంలో మొదటిసారి కలుసుకున్న ప్లేస్కి గుర్తుగా ఈ ప్లేస్లోనే తమ పెళ్లి వేడుక నిర్వహించుకున్నారు. ఇటలీలోని ఈ టుస్కానీ ప్లేస్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన పురాతన గ్రామం కావడం విశేషం. హిస్టారికల్గా బాగా పేరు సంపాదించింది. అత్యద్భుతమైన గ్రీనరీకి నెలవుగా నిలుస్తుంది. పెళ్లి వేదిక వద్దకి వరుణ్ తేజ్, లావణ్య లగ్జరీ కారులు రాయల్ లుక్లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఇందులో మెగా ఫ్యామిలీ అంతా వరుణ్లవ్ లను స్వాగతించారు. అనంతరం వేదిక వద్ద డాన్సులతో హోరెత్తించారు. నాగబాబు, వరుణ్ తల్లి, నిహారిక వంటి వారు సంబరాల్లో మునిగిపోయారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. నవంబర్ 3వరకు వీరంతా ఇటలీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కి రానున్నారు. నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్లో జరిగే రిసెప్షన్ వేడుకకి సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తరలి రానున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…