CM YS Jagan : ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. తెలంగాణ ఫలితాలు వెల్లడి తరువాత ఇక ఏపీలో రాజకీయం వేడెక్కనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయం కాగా, తెలంగాణలో బీజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. ఏపీలో తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ మరోవైపు తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. జగన్ సీఎం అవుతాడని కొందరు, కాడని మరికొందరు చెబుతున్న నేపథ్యంలో వైసీపీని నమ్ముకున్న ఓ మహిళ తాజాగా జగన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కాకానాడకి చెందిన బొజ్జ ఐశ్వర్య.. జగన్ గెలుపు కోసం చాలా కష్టపడిందట. కాళ్లకి ఉన్న చెప్పులు అరిగేలా తాను తిరిగానని చెప్పిన ఐశ్వర్య జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మోసం చేసారని వాపోతుంది.
జగన్ సీఎం అయ్యాక ఆయన కోసం కష్టపడి పని చేసిన వారిని పట్టించుకోవడమే మానేశాడు. అన్నీ కలుషితం చేశాడు. మంచి చేశావని నువ్వు ఫీలవుతున్నావా. డప్పుల బ్యాచ్ల డప్పులు నువ్వు వింటున్నావు. మా ఆకలి బాధలు నీకు వినపడడం లేదు. నీ ఎమ్మెల్యేలకి ఎందుకు భయపడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకి లోన్ ఇవ్వలేదు. మా బాధలు నీకు కనిపించడం లేదా..నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకుంటే బెటర్. నేను డాక్టర్తో మాట్లడతాను. సైకియార్టిస్ట్ దగ్గరకి వెళ్లి చూపించుకో. 2024లో నీకు ఓటర్ అంటే ఏంటో చూపిస్తాను. నీకున్న డబ్బుతో, బలంతో, రెడ్డి సామాజిక వర్గంతో నువ్వు ఏదైన చేసి నువ్వు నెగ్గిన నీ గేటు ముందు కూర్చుంటా.
నువ్వు నన్ను ఈడ్చేసిన, చంపిన కూడా నేను భయపడను. అన్ని తెగించేసి వచ్చా. జగన్ మాకు ఎందుకు వద్దు అని గడప గడపకి వెళ్లి ప్రచారం చేస్తాను. సొంత డబ్బులతో పాంప్లెట్ కొట్టించి ప్రచారం చేస్తాను. నీవు పెట్టిన ఫుడ్ ఎవరు తినట్లేదు. గుడ్డు ఎంత చిన్నగా ఉంది. అది కోడి గుడ్డేనా .. నేను ఇప్పుడు తెగించేసా. ఇక నలిగిపోవడం మా వల్ల కావట్లేదు. నీకు దేవుడు తప్పక సమాధానం చెబుతాడు. జగన్ నువ్వు చూసుకో ఇక. 175కి 175 అంటున్నావ్ కదా, ఎన్ని వస్తాయో చూసుకో. నువ్వు చేసిన పాపానికి రెట్టింపు ఇస్తాం. మనిషిలా ఉండి ఇప్పటికైన పుణ్యం కూడగట్టుకో. జగన్ కి తప్ప ఎవరికైన ఓటు వేసుకోండి అని ఆమె ఓటర్లకి తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్ గా మారింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…