Mahesh Babu : డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ మూవీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రణ్బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మహేష్ బాబు.. తాను రణ్బీర్ కి పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. “ఇంతకుముందు కూడా రణ్బీర్ కి చెప్పాను. కానీ అతడు అంత సీరియస్ గా తీసుకున్నట్లు లేడు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పై నుంచి చెబుతున్నాను. నేను రణ్బీర్ కి వీరాభిమానిని. ఇండియాలో అతడే బెస్ట్ యాక్టర్. యానిమల్ లో తన అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్” అని మహేష్ అన్నాడు. అయితే అందరి గురించి మాట్లాడిన మహేష్ రష్మికని మరచిపోయారు. తిరిగి మళ్లీ మైక్ అందుకొని ఆమె గురించి గొప్పగా మాట్లాడాడు. అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నావు. నీకోసం కొత్త లాంగ్వేజ్ కనిపెట్టేలమో అంటూ ఫన్ చేశాడు.
ఇక అనిల్ కపూర్.. తనకు మహేష్ బాబు పాటకి డ్యాన్స్ చేయాలని ఉందని అన్నారు. అంతేకాదు, మహేష్ బాబు వచ్చి తనతో డాన్స్ చేయాలని కోరారు. దీనికి మహేష్ బాబు నవ్వుతూ, దండం పెడుతూ నా వల్ల కాదన్నట్టు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, అనిల్ కపూర్ వదల్లేదు. రణ్బీర్, మహేష్ వేదికపైకి రావాల్సిందేనని పట్టుబట్టారు. ‘నేను మీ సీనియర్ని.. వస్తారా రారా’ అని అడిగారు. దీంతో మహేష్, రణ్బీర్ వేదికపైకి వెళ్లారు. వెంటనే ‘పోకిరి’లో ‘డోలె డోలె’ పాట వేశారు. దీనికి మహేష్ బాబు చేత్తో చిన్న స్టెప్ వేశారు. అనిల్ కపూర్ మాత్రం ఉత్సాహంగా రెండు స్టెప్పులు వేశారు. వెంటనే మహేష్ బాబు వేదికపై నుంచి దిగిపోయారు. మొత్తానికి ఈ సీన్ ప్రేక్షకులను అలరించింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…