Janasena : ఈ సారి ఓట్లు చీలకుండా జనసేన చాలా కీలకంగా పని చేసింది. జనసేన పార్టీ 2014లో మాదిరిగా 2024లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీతో కూటమిగా బరిలో దిగింది. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాజోలు సీటు మాత్రమే గెలుచుకున్న ఈ పార్టీ చేతులు కాల్చుకుంది. ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్.. గాజువాక, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది.
ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఓట్లు శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కచ్చితంగా గెలిచే స్థానాలివే అంటూ 11 అసెంబ్లీ స్థానాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ 11 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలి నియోజకవర్గాలతో పాటు మరో 9 ఉన్నాయి. అవి చూస్తే అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, నర్సాపురం, యలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లి గూడెం, అవనిగడ్డ ఉన్నాయి.
అయితే తనను దత్త పుత్రుడున్నా.. ప్యాకేజీ స్టార్ అన్నా.. అవేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కూటమి తరుపున బలంగా పోరాడారు. ముఖ్యంగా ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేయడం వెనక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. ఒకవేళ కూటమి అధికారంలో వస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకుగాను పవన్ పార్టీకి ఆరు మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. రెవిన్యూ, నీటి పారుదల, పౌర సరఫరాలుతో పాటు మరో మూడు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, కందుల దుర్గేష్, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ మంత్రి పదవులు దక్కించుకునేందుకు ముందు వరసలో ఉన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…