Kajal Aggarwal : కలవ కళ్ల సుందరి పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఆమె సత్యభామ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.ఫిమేల్ సెంట్రిక్ మూవీగా సత్యభామ రూపొందగా, ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 31, 2024 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. రీసెంట్గా సత్యభామ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఆకట్టుకుంది.
మూవీ ప్రమోషన్లో భాగంగా కాజల్ తెగ ఇంటర్వ్యూలు ఇస్తుంది.ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ హీరోయిన్. ఐపీఎల్ లో తెలుగు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్న విషయాన్ని ఇటీవల కాజల్ తెలిపింది.సన్ రైజర్స్ హైదరాబాద్ లో తన ఫేవరెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అంటూ హీరోయిన్ కాజల్ తెలిపింది. తనకు ఇష్టమైన ఐపీఎల్ టీం సన్ రైజర్స్ అంటూ ఇక సత్యభామ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఫేవరెట్ ఫిలిం సెంట్ ఆఫ్ ఉమెన్ అంటూ తెలిపింది. ఆల్ టైం ఫేవరెట్ కోస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటూ తెలిపిన కాజల్. ఇక ఓవరాల్ క్రికెట్లో చూసుకుంటే ధోని తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ చెప్పకు వచ్చింది. నితీష్ కూడా తనకి ఇష్టమని చెప్పుకొచ్చింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇష్టమని కాజల్ తెలియజేగా, ఆ సమయంలోనే అతను క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో కాజల్ అగర్వాల్ సందడి చేసింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్స్లోకి ముఖ్య అతిథిగా వచ్చిన కాజల్ అగర్వాల్.. తన వ్యాఖ్యానంతో అదరగొట్టింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…