Chiranjeevi : ఆస్తుల‌ను అమ్ముకోవాల్సిన అవ‌స‌రం చిరంజీవికి ఏమొచ్చింది..? ఎందుక‌లా చేశారు..?

Chiranjeevi : ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. పైగా ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అంటే దాదాపు రూ.200 కోట్ల పారితోషికం అన్నమాట. అలాంటి చిరంజీవికి ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది ? అయినా చిరంజీవి ఆస్తులు అన్నీ లెక్క కడితే ఏకంగా వేల కోట్లు ఉంటాయి కదా.. అలాంటప్పుడు ప్రాపర్టీస్ అమ్ముకొనేంత అవసరం ఏమొచ్చింది.. అసలు ఇందులో నిజం ఎంత ఉంది..? ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా గట్టిగా చర్చ జరుగుతుంది. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో ఆ చిత్ర నిర్మాత ఎన్ వి ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ఆస్తులు అమ్ముకున్నాడు.. చెన్నైలో ఆయనకు ఉన్న ఒక ప్రాపర్టీ అమ్ముకొని పార్టీని నడపాల్సి వచ్చింది అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే చిరంజీవి ఆస్తులు అమ్ముకున్నది ఇప్పుడు కాదు.. ప్రజారాజ్యం సమయంలో నాటి పరిస్థితుల గురించి మరోసారి మీడియా ముందు వివరించాడు నిర్మాత ఎన్ వి ప్రసాద్. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి.. 2009లో పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి దారుణ పరాజయం పాలయ్యాడు మెగాస్టార్.

why Chiranjeevi sold his properties
Chiranjeevi

ఆ సమయంలో సీట్లు అమ్ముకున్నాడు.. పార్టీ పేరు చెప్పి వేల కోట్లు వెనకేసుకున్నాడు అంటూ చిరంజీవి పై ఎన్నో అభియాగాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఏరోజు కూడా చిరంజీవి నోరు తెరిచి మాట్లాడలేదు. మూడు సంవత్సరాలు ప్రజారాజ్యం పార్టీని నడిపిన తర్వాత.. కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉన్న ఈయన.. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు దాన్ని నడపడానికి చెన్నైలో ప్రసాద్ ల్యాబ్ పక్కన ఉన్న ఆయన ప్రాపర్టీస్ ని అమ్ముకున్నాడు అని నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఆయన పార్టీ నుంచి అన్ని వేల కోట్లు సంపాదిస్తే.. ఆస్తులు అందుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఆ నిర్మాత చెప్పిన అంతరార్థం. విషయం ఏదైనా కూడా చిరంజీవి ఆస్తులు అమ్ముకున్నాడు అనేది మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అది ఆయనను అభిమానించే వాళ్లకు కూడా అంతగా మింగుడు పడని విషయం. అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆయన సీట్లు అమ్ముకొని అన్యాయంగా డబ్బులు సంపాదించాడు అనే విషయంపై మాత్రం ఇంతవరకు చిరంజీవి స్పందించలేదు. దీనిపై కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

11 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago