Samantha : నాతో పెట్టుకుంటే అంతే.. ట్రోలర్స్ కు సమంత వార్నింగ్..

Samantha : సమంత పైకి ఎంత సైలెంట్ గా కనిపిస్తుందో.. లోపల అంతా వైలెంట్. తనను ఎవరు టచ్ చేయనంత వరకు బాగానే ఉంటుంది.. కానీ ఎవరైనా తనను పర్సనల్‌గా టార్గెట్ చేశారంటే మాత్రం ఇచ్చే సమాధానాలు మరో స్థాయిలో ఉంటాయి. తాజాగా మళ్లీ ఇదే చేసింది సమంత. కొన్ని నెలల నుంచి ఆమె సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎక్కడా కనిపించడం లేదు. దాంతో సమంతకు ఏదో అయిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయని.. అమెరికా వెళ్లి వాటిని పరిష్కరించుకొని వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు వెళ్ళిందో తెలియదు కానీ నెల రోజులు మాత్రం అమెరికాలోనే ఉంది సమంత.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అన్నింటినీ జాగ్రత్తగా గమనించిన సమంత.. ఒకే ఒకసారి అందరికీ సమాధానం చెప్పింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఓడిపోలేదు కాస్త వెనక్కి తగ్గాను అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఇన్ని రోజులు తనను ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్లను ఉద్దేశించి నేను ఇంకా ఉన్నాను.. ఓడిపోలేదు అని గుర్తు చేసింది సమంత. ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్ అయిపోయింది. వాటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా జరుగుతుంది.

Samantha given warning to her trollers
Samantha

నవంబర్ మొదటి వారంలో ఈ రెండు సినిమాల ప్రమోషన్ కోసం కొన్ని రోజులు డేట్స్ అడ్జస్ట్ చేసింది సమంత. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తోంది. కేవలం సమంత కారణంగానే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింద‌ని ప్రచారం జరుగుతోంది. ఆమె డేట్స్ ఇస్తే ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళుతుంది.. లేదంటే ఇంకా ఆలస్యం అవ్వక తప్పదు. ఇప్పటికే డిసెంబర్ 23న రావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ మారిపోయిందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఖుషి వాయిదా పడింది అంటూ ప్రచారం జరుగుతుంది. తనపై జరుగుతున్న ఈ వార్తలని జాగ్రత్తగా గమనించిన సమంత.. ఇన్ని రోజుల తర్వాత బయటికి వచ్చి నేను ఇంకా రేసులోనే ఉన్నాను అనే సంకేతం ఇచ్చింది.

అక్టోబర్ చివరి వారంలో విజయ్ దేవరకొండ సినిమాతో బిజీ కానుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేయనుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఈమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సిటేడాల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత ఒక యాక్షన్ రోల్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్ తెరకెక్కించిన రాజ్ డీకే దీనికి దర్శకులు. వరుణ్ ధావన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కానుంది. ఏదేమైనా ఇప్పటినుంచి ఫుల్ బిజీ కావాలని ఆలోచిస్తుంది సమంత.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

31 mins ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

13 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago