SV Krishna Reddy : కొందరు సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సినిమాకి పని చేసిన వారికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం కామన్. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ సమయంలో కూడా హీరోయిన్ లను ఎంతో పద్దతిగా చూసుకుంటారని చెబుతుంటారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా హీరోయిన్ లకు డబ్బులతోపాటు వెండి పళ్లెంలో పట్టుచీరలు పెట్టి సన్మానం చేసేవారని చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడగ్గా, అది తన అమ్మ నుండి నేర్చుకున్నానని అంటుంటాడు.
నా తల్లి, భార్య, కూతుళ్లు కూడా ఆడవాళ్లే కాబట్టి వారిని గౌరవిస్తాను అంటూ కృష్ణారెడ్డి అంటుంటారు. తన సినిమాలలో కూడా అశ్లీలత ఉండదని అలా వినోదాన్ని పంచకుండా కామెడీతో ముందుకు తీసుకెళతానని కృష్ణా రెడ్డి చెబుతుంటారు. ఎస్వీ కృష్ణారెడ్డి.. చిన్న చిన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, బాధల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా.. లాంటి చిత్రాలు ఎంతో సూపర్ హిట్ లను సాధించాయి.
కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాని తీస్తున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పన నిర్మిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…