YS Jagan : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ చక్రం తిప్పుకుతున్నాయి. రెండు రాష్ట్రాలలో కొత్త పార్టీలు వచ్చాక చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతుండడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆ పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పరిస్థితి కూడా అదే మాదిరిగా మారింది. జగన్ కూడా పార్టీని వీడి వెళ్లే వారిని ఎవరినీ ఆపే ప్రయత్నం చేయడం లేదు. కనీసం పార్టీ నేతలను పంపించి అయినా బుజ్జగించడం వంటి చర్యలకు దిగడం లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు ఓటమి పాలయిన తర్వాత పార్టీని వీడివెళ్లడంపై వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. బెల్లం చుట్టూ ఈగలు చేరడం మామూలే. అలాగే వైసీపీ నేతలు కూడా అధికారంలో ఉన్నప్పుడు లీడర్లుగా బిల్డప్ లు ఇచ్చి ఇప్పుడు అధికారం కోల్పోగానే జెండాను వదిలి పెట్టి వెళ్లడం చూస్తే వారిలో ఎంతటి స్వార్థ పూరిత రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని జగన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకే తాను నమ్మిన వారు.. తాను పదవులు ఇచ్చిన వారు వదలి వెళ్లి పోతున్నా కొందరు నేతలు వారితో మాట్లాడతామని చెప్పినా అవసరం లేదని వైఎస్ జగన్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది.
వెళ్లే వాళ్లను ఆపకండి అంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అందుకే ఎవరు వెళ్లినా పెద్దగా పట్టించుకోవద్దని, వైసీపీకి నాయకత్వ సమస్య ఎక్కడా లేదని వైఎస్ జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. పార్టీ నుంచి వెళుతున్న వారు అనవసర సాకులు చెబుతున్నారని, పార్టీపై అభిమానం ఉంటే నేరుగా తనకు కంప్లయింట్ చేయాలని, అంతే తప్ప కుంటిసాకులు చెప్పడం ఏంటని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది అని కొందరు చెప్పుకొస్తున్నారు. చూస్తేంటే రానున్న రోజులలో జగన్ వైసీపీపై ఉనికిని కోల్పోతారనే టాక్ వినిపిస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…