నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా బుల్లితెరపై ‘అన్ స్టాపబుల్’ షోతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. ఈ షో అన్ని షోల రికార్డ్లని తుడిచి పెట్టుకు పోతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ వారి నుండి ఆసక్తికర విషయాలు రాబడుతున్నాడు బాలయ్య . మరోవైపు, తొలిసారి ఆయన ఒక యాడ్ లో నటించారు. ప్రముఖ కన్ ష్ట్రక్షన్ కంపెనీ సాయి ప్రియ గ్రూప్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ఎంతో రాయల్ గా, రిచ్ లుక్ తో ఉంది.
సినిమాటిక్ స్టైల్లో ‘116 పారామౌంట్’ వెంచర్ను ప్రమోట్ చేస్తూ.. తన దైనశైలిలో డైలాగ్లు చెప్తూ అలరించారు బాలయ్య. స్టైలిష్ లుక్లో అదరగొట్టారు. అయితే ఫస్ట్ యాడ్ ద్వారా బాలయ్య అందుకున్న తొలి పారితోషికం అక్షరాలా రూ.15 కోట్లు. అయితే ఈ భారీ పారితోషికం మొత్తాన్ని.. ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్’కి దానం చేశారు బాలయ్య. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన బాలయ్య.. ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ను క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా ఇచ్చాడని తెలిసి ఆయనను అభిమానులు తెగ కీర్తిస్తున్నారు.
బాలయ్య రూ.15 కోట్ల దానానికి సంబంధించిన అప్డేట్ని ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేస్ దేవి నాగవళ్లి తన ఫేస్ బుక్లో షేర్ చేయగా.. అప్పట్లో అది తెగ వైరల్గా మారింది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ వీరసింహా రెడ్డి చిత్రంతో రీసెంట్గా పలకరించాడు. ఇది మంచి విజయం సాధించింది. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యతో పోటీ పడిన ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీస్ని షేక్ చేసింది. దీంతో పాటు.. అనిల్ రావిపూడి సినిమాను సైతం లైన్లో పెట్టాడు బాలయ్య. అటు సినిమాలు చేస్తూ.. ‘అన్ స్టాపబుల్’ షోని కూడా ముందుకు నడిచేలా చేస్తున్నాడు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…