Vittalacharya : విఠలాచార్య.. ఈ దర్శకుడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉడిపి విఠలాచార్య. టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసిన ఆయన మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని పంచారు. ఈ సినీ మాయ మాంత్రికుడి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆణిముత్యాలు.
ఉడిపిలో పుట్టిన విఠలాచార్య సినిమాలో కళ కంటే వ్యాపారమే ఎక్కువ ఉందని నమ్మి ముందు వ్యాపారంలోకి వచ్చాడు. ఆ తర్వాత సినిమా పిచ్చి కూడా తోడైంది. 55 సినిమాలకు దర్శకత్వం వహించి జానపద బ్రహ్మగా పేరు సంపాదిచుకున్న ఆయన ఒక బడ్జెట్ మనిషి కాబట్టి హీరో తేదీలు తక్కువ తీసుకుని సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేస్తుంటాడు. సంవత్సరాల తరబడి కాల్షీట్స్ ఆయనకు అవసరం లేదు. వారం పది రోజులు ఇచ్చిన సినిమాని పూర్తి చేసే స్టైల్ విఠలాచార్యది. ఒకసారి నందమూరి తారక రామారావుతో ఒక సినిమా తీయాలని అడగ్గా కేవలం వారం మాత్రమే డేట్స్ ఉన్నాయని చెప్పాడట.
అయితే ఆ వారం రోజులు నాకివ్వండి చాలు.. అని విఠలా చార్య అంటే దాంతో ఎన్టీఆర్ భయపడ్డారట. వారం రోజుల్లో సినిమాలు ఎలా పూర్తి అవుతుంది. కొంత షూటింగ్ చేశాక హీరోకి శాపం పెట్టేసి సినిమాలో కనిపించక ముందే పూర్తి చేస్తాడేమోనని భయం వేసి ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట. అలా ఎన్టీఆర్ విఠచార్యతో సినిమాలు చేయకుండా అయిపోయింది. ఏ సినిమా అయినా ప్రణాళికాబద్దంగా తీసేవాడు. ఎక్కడా పైసా కూడా వృథా ఖర్చు చేసేవాడు కాదాయన. సినిమా మూహుర్తపు షాట్ రోజే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే ధైర్యం బహుశా ఆయనకొక్కడికే వుందేమో. స్క్రిప్టు వర్క్ పూర్తికాగానే ఆర్టిస్టులందరికీ వారి వారి పోర్షన్ తాలూకు పేపర్లను పంపించేస్తారు. ఆర్టిస్టులంతా సంభాషణలు కంఠస్తం చేయాల్సిందే. అలా ఉంటుంది విఠలాచార్య సినిమా స్టైల్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…