Virat Kohli : వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత వరల్డ్ కప్లో కోహ్లీ సెంచరీ చేశాడని మురిసిపోతున్నారు. కానీ ఇలా కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ రిచర్డ్ కెటిల్బరో కూడా హెల్ప్ చేశాడని కొందరు మర్చిపోతున్నారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ మాత్రం కెటిల్బరోపై కూడా జోకులు వేస్తున్నారు. కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. వచ్చీరావడంతోనే అతను కోహ్లీ లెగ్సైడ్ బంతిని వేశాడు. కోహ్లీ కొంచెం అలా పక్కకు తప్పుకోగానే అది అతని కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లో పడింది.ఇలా కావాలని నాసుమ్ వైడ్ డెలివరీ వేయడం చూసిన కోహ్లీ చికాకు పడ్డాడు.
అయితే అంపైర్ రిచర్డ్ కెటిల్బరో మాత్రం దాన్ని వైడ్గా ప్రకటించలేదు. కోహ్లీ కూడా ఈ నిర్ణయం చూసి షాకయ్యాడు. గడ్డం గీక్కుంటూ ఆలోచిస్తున్నట్లు కెటిల్బరో కనిపించాడు. ఆ తర్వాత మూడో బంతికే భారీ సిక్సర్ బాదిన కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కెటిల్బరో ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న ఫ్యాన్స్.. ‘అసలు కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్ అతనికి మెడల్ ఇవ్వాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి కేఎల్ రాహుల్ వారధిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే అవకాశం ఉన్నాగానీ సెంచరీ వద్దనుకున్నాడు విరాట్. కానీ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో.. చివరకు శతకాన్ని అందుకున్నాడు రన్ మెషిన్. ఈ విషయాన్ని స్వయంగా మ్యాచ్ అనంతరం వెల్లడించాడు రాహుల్.
రాహుల్ మాట్లాడుతూ..”కోహ్లీ సింగిల్ తీద్దాం అంటే నేనే వద్దని చెప్పా. కానీ సింగిల్స్ తీయకపోతే.. జనాలు, ఫ్యాన్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని అనుకుంటారని కోహ్లీ చెప్పాడు. అయితే మనం ఎలాగో గెలుస్తాం.. అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు, నువ్వు సెంచరీ పూర్తి చెయ్” అని చెప్పానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ రాహుల్ చేసిన మరో గొప్ప పని ఏంటంటే? విరాట్ 74 పరుగులతో ఉన్నప్పుడు.. విజయానికి 26 పరుగులు అవసరం. అయితే ఆ తర్వాత నుంచి కేఎల్ రాహుల్ ఒకే ఒక్క బంతి మాత్రమే ఆడాడు. విరాట్ సింగిల్స్ కోసం ప్రయత్నించినా.. రాహుల్ వెళ్లలేదు. దీంతో 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 97 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. విజయానికి కేవలం 2 రన్స్ మాత్రమే కావాలి. అప్పుడు సిక్స్ కొట్టి ముగించాడు. అయితే జడేజాకి రావల్సిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకు దక్కిందంటూ కోహ్లీ ఫన్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…