Vijaya Shanti : విజయశాంతి..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఈ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి మరోసారి అలనాటి విజయశాంతిని గుర్తుచేశారు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించలేదు. మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది విజయశాంతి. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో కళ్యాణ్ రామ్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
ఈ మూవీకి ‘రాజా చెయ్యి వేస్తే’ ఫేమ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే విజయశాంతిని చూడగానే కళ్యాణ్ రామ్, మురళీ మోహన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అందరిని ఆశ్చర్యపరచింది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించనుంది. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రారంభోత్సవ వేడుకలో కళ్యాణ్ రామ్ తో పాటుగా విజయ శాంతి, సయీ మంజ్రేకర్ సందడి చేసారు. మహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…