Vijaya Shanti : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా తొలిసారి రానా నాయుడు అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అనేక విమర్శలని మూటగట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో నోటి నుండి డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ను సౌత్ ఆడియన్స్ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్పై విజయశాంతి నిప్పులు చెరిగింది.
తన సోషల్ మీడియా వేదికగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.. ఇన్ డైరెక్ట్గా ఈ వెబ్ సిరీస్పై పంచ్లు పేల్చింది. ముఖ్యంగా ఇటువంటి ఓటీటీ కంటెంట్కు సెన్సార్ తప్పనిసరి అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందు ముందు ప్రజా, మహిళా వ్యతిరేకత రాకముందే ఓటీటీ ప్లాట్ఫామ్స్ విడుదల చేసే కంటెంట్కు సెన్సార్ తప్పనిసరి చేయాలన్నట్టు విజయశాంతి సూచన చేసింది. అంతేకాకుండా.. తన సహనటులకు, నిర్మాతలకు కూడా ఆమె ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టింది.. ఈ విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.
ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోకుంగా సంబంధిత నటులు, మరియు నిర్మాతలు ఓటీటీ నుండి నిరసించబడుతున్న ప్రసారాలని తొలగించి భవిష్యత్లో దేశవ్యాప్త ఓటీటీ ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తున్నాను.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను అని విజయశాంతి తన పోస్ట్లో పేర్కొన్నారు.ఇక రీసెంట్గా సీనియర్ నటుడు శివకృష్ణ ఓటీటీ కంటెంట్పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు.ఓటీటీలు మన సంస్కృతి, సాంప్రదాయాలు ఖూనీ చేయబడుతున్నాయి. అలా అయితే దేశం నాశనం అవుతుందని శివ కృష్ణ అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…