Venkatesh : స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతూ మంచి హిట్స్ అందుకుంటున్న హీరో వెంకటేష్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును తెచ్చుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్గా హవాను చూపిస్తున్నారు..ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన.. కొంత కాలంగా చాలా నెమ్మదిగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. అదే సమయంలో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ‘సైంధవ్’ అనే సైన్స్ ఫిక్సన్ మూవీని చేశారు. విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది.
మూవీ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహాణిశర్మలతో కలిసి స్టేజ్పై వెంకటేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాటకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు వెంకటేష్. ముందుగా హీరోయిన్స్ వేదికపైకి వెంకీని పిలవాలని ఆహ్వానించారు. కొంత సేపు ఆలోచించి వచ్చి డ్యాన్స్ చేశారు. రచ్చ రచ్చగా మారిన వారి డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణిశర్మతో పాటు ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ వైఫ్గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోండగా, రుహాణిశర్మ డాక్టర్గా కనిపించబోతున్నది.
సైంధవ్ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న 75వ మూవీ. ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైంధవ్ సినిమాలోని డైలాగ్స్లోని చెప్పి అభిమానులను అలరించారు వెంకటేష్. సైంధవ్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వెంకటేష్ చెప్పాడు. యాక్షన్ సీక్వెన్స్ డిఫరెంట్గా ఉంటాయని అన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే ‘సైంధవ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను పోషించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…