KA Paul : ఏపీలో అసలే ఎన్నికల వేడి ఓ రేంజ్లో ఉంది. ప్రతీ పార్టీ తమ అభ్యర్ధుల ఎంపికలో తల మునకలై ఉన్నాయి. కాస్తో కూస్తో సమయం దొరికితే జనంలోకి వెళ్లేందుకు ప్రతీ పార్టీ అధినేతా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మధ్య మధ్యలో తెగ రచ్చ చేస్తున్నాడు. రీసెంట్గా సీఎం జగన్ ను కలుస్తానంటూ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అపాయింట్ మెంట్ లేకపోయినా వచ్చేసినా పాల్.. జగన్ ను కలిస్తే కానీ వెళ్లనంటూ అక్కడ కాసేపు హల్ చల్ చేశారు. జగన్ను కలిసేందుకు పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్కు తెలిపారు.
అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం క్యాంప్ ఆఫీస్ వద్ద కేఏ పాల్ గంటకు పైగా వేచి చూశారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో క్యాంప్ కార్యాలయం నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం తనకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని.. కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఆయన మాజీ సీఎం అయ్యాకే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు.
ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు అపాయింట్మెంట్ ఇచ్చారని కొనియాడారు. అయితే జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తానని.. రహస్యాలు చెబుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో లేదా 75 సీట్లు గెలుస్తారో.. లేదా 25 సీట్లు మాత్రమే గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…