నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే ఈ సినిమాతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకుల క్రష్ గా మారిపోయింది. ఆమెను సోషల్ మీడియాలో కుర్రాళ్లు తెగ ఫాలో అయిపోతున్నారు. కొత్త పిక్ పెట్టీ పెట్టగానే లైకులు కొట్టేస్తున్నారు. అయితే ఆమెకు ఇప్పుడు తెలుగులో ఇంత ఫాలోయింగ్ వచ్చింది. అయితే హనీ రోజ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని పలకరించలేదు. దాదాపు 14 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయినగా నటించింది.
అయితే ఇప్పుడు ఆమె చేసిన ఆ తెలుగు సినిమా గురించి వెతుకులాట మొదలు పెట్టారు. వీరసింహారెడ్డి సినిమాలో హనీరోజ్ నటన, అందం, అభినయం, స్మైల్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా కాగా, ఆమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా యాడ్ చేసుకున్నారు. నిజానికి హనీరోజ్ కి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ వచ్చింది. 2008లో శివాజీ సరసన ఆమె ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఊహించినంత్ ఆదరణ దక్కకపోవడంతో హనీరోజ్ గురించి కూడా ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు.
వీరసింహారెడ్డి సినిమాతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. హనీరోజ్ తన 14 ఏట నుంచే యాక్టింగ్ మొదలు పెట్టింది. 2005లోనే ఆమె తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించగా, 2008లో ఆలయం సినిమాలో నటించింది. తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా కూడా చేసింది. అది కూడా ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది. తర్వాత ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల తర్వాత హనీరోజ్ మళ్లీ తెలుగులో వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది. ఈ సినిమాతో మలయాళంలోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…