టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ కొన్నాళ్లుగా తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన భార్య రమ్యా రఘుపతితో విబేధాలు నెలకొని ఉండగా, ఆ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. రమ్యకు వ్యతిరేకంగా నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తనను వేధిస్తోందని, హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రమ్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పెళ్లైన తొలి రోజుల నుంచే రమ్యా తనను వేధిస్తోందని, ఆమెతో కలిసి జీవించలేనని ఆయన పేర్కొన్నారు.
పెళ్లెన తర్వాతి నెల నుంచే రమ్య నన్ను వేధించేదని, ఇప్పుడు తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తన భార్య రమ్య తనను చంపడానికి కర్నాటకకు చెందిన రౌడీ షీటర్ తో రెక్కి చేయించిందని.. అలాగే ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందని.. రమ్య బంధువు అయిన మాజీ మంత్రి రఘవీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతోందని, 10 కోట్ల రూపాయిలు ఇస్తే సెటిల్ మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసిందని నరేష్ ఆమెపై తీవ్ర ఆరోపణలు గురిపించారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.
సీనియర్ దిగ్గజ నటి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతం లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నారు. వృత్తిపరంగా నరేష్ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకోని ఇద్దరితో విడాకులు తీసుకున్న, మూడో భార్య రమ్యతో విడాకులు తీసుకోవాడని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహచర నటి పవిత్రతో కలిసి ఉంటున్నారు. ఇటీవలే నరేష్- పవిత్రలు పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఓపెన్ గా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…