VC Sajjanar : తెలంగాణలో నేటి(డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ పరిధిలో టీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడినా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో తెలంగాణ పరిధిలో మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చుని ప్రభుత్వం రీఎంబర్స్ చేయనుంది.రీసెంట్గా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందన్నారు.
మహిళల స్వయంశక్తి మెరుగవుతుందని .. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని సజ్జనార్ ఆకాంక్షించారు. మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీని ఆదేశించారని ఆయన తెలిపారు. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం. రోజూ రాష్ట్రంలో 40లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో మహిళల సంఖ్య 12 నుంచి 14 లక్షలు. యాజమాన్యం విస్తృతంగా చర్చించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. మహిళలు సామూహిక ప్రయాణం చేసేందుకు ఉచితంగా బస్సుల అనుమతింపబడవు” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు , వృద్ధులు ప్రయాణించవచ్చని.. ఏదైనా ఒక గుర్తింపు కార్డు వుంటే చాలని సజ్జనార్ స్పష్టం చేశారు. తొలి వారం రోజులు ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయవచ్చని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో మాత్రం ఉచిత ప్రయాణం వుండదని, ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని ఎండీ చెప్పారు. అయితే టూర్స్ కి వెళ్లాలనుకునే వారికి ఇవి వర్తించవు అని సజ్జనార్ అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…