Vangalapudi Anitha : వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులపై టీడీపీ నాయకులు గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ నియమించిన టీటీడీ సభ్యులు జాతి రత్నాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. ఇలాంటి బోర్డు వేస్తే పులులు తరమడానికి కర్రలు ఇవ్వాలనే నిర్ణయాలే వస్తాయని విమర్శించారు. నడక మార్గంలో పులులు వస్తున్నాయి కాబట్టి నడక మార్గం మూసేసినా ఆశ్చర్యం పోనక్కర్లేదన్నారు. డబ్బు కోసం ఎంత వరకైనా వెళ్లే వ్యక్తులు టీటీడీ బోర్డులో ఉన్నారని ధ్వజమెత్తారు.
చాగంటి కోటేశ్వరరావుకు బోర్డులో సభ్యత్వం ఇచ్చినా దాన్ని ఆయన తిరస్కరించారన్నారు. జగన్ పరిపాలనలో వేసిన టీటీడీ బోర్డులో చాగంటి కొనసాగలేకపోయారని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులకు తిరుమల కొండ వేదికగా మారిందన్నారు. రాజకీయ నిరుద్యోగులతో టీటీడీ బోర్డును నింపేస్తున్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్కు లేదా అని నిలదీశారు. క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని గగ్గోలు పెడుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుపతి కొండ రాజకీయ వివాదాలకు, రాజకీయ నినాదాలకు నిలయంగా మారటం చాలా దురదృష్టకరమని వంగలపూడి అనిత అన్నారు.
వెంకన్నతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో జగన్ కు చాలా బాగా తెలుసు. అయినా జగన్ మళ్లీ వెంకన్నతోనే పెట్టుకుంటున్నారు. . కళంకితులు, క్రిమినల్స్, అన్యమతస్తులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు అనిత. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందులో కొందరు వ్యక్తుల నియామకంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…