Sr NTR Rs 100 Coin : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు – భువనేశ్వరి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – వెంకటేశ్వరరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, కల్యాణ్ రామ్ హాజరయ్యారు. అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ప్రముఖ సినీ నిర్మాతలు అశ్వినీదత్, దగ్గుబాటి సురేశ్బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చల్లా రాజేంద్రప్రసాద్, టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోన్రావు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు, మనుమలు, మనుమరాళ్లు పాల్గొన్నారు.
దాదాపు 200 మంది అతిథులకి ఈ కార్యక్రమంకి ఆహ్వానం అందింది. అయితే ఎన్టీఆర్ 100 రూపాయల నాణేలను విడుదల చేసే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని ఏపీ తెలుగు, సంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యగా నాణేల విడుదల కార్యక్రమానికి హాజరయ్యే హక్కు తనకు ఉందని లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఎన్టీఆర్ రూ.100 నాణెం మొత్తం చుట్టుకొలత 44 మిల్లీ మీటర్లు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు. నాణానికి ఒకవైపు మూడు సింహాలతోపాటు అశోక చక్రం.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం ఉంటుంది. నందమూరి తారక రామారావు శతాబ్ది వర్ష్ అని హిందీ భాషలో.. ఎన్టీఆర్ శత జయంతి ముగింపునకు సూచికగా 1923 – 2023 సంవత్సరం కూడా నాణెంపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించి, తెలుగు ప్రజలందరినీ సంతోషపర్చాలని, తెలుగు జాతిని గౌరవించాలని కొందరు కోరుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…