Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాప పుట్టినప్పటి నుండి పాప ఆలనా పాలనా చూసుకుంటూ చాలా ఆనందకరమైన జీవితం గడుపుతుంది ఉపాసన. తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ సింగిల్ మదర్స్ కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది ఉపాసన. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామని చెప్పింది. నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారు.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో పేరెంట్స్ వద్దకు చేర్చడం మా బాధ్యత. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని . పిల్లలకు అనారోగ్యానికి గురయితే ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతారో నాకు తెలుస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ఇబ్బందిపడడం నేను చూశాను. కొందరు మహిళలు నా దగ్గరకి వచ్చి బాధ చెప్పుకోగా, అది విని చాలా బాధపడ్డాను.
నన్ను ఆశ్రయించిన వారిలో సింగిల్స్ మదర్స్ ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ చాలా అవసరం. అందుకే మేము ఓ ప్రకటన చేస్తున్నాము. వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి ఉచితంగా వైద్యం పొందవచ్చు. దీనివల్ల వారికి మేలు లాభం చేకూరుతుందని అనుకుంటున్నాను. వాళ్లను ప్రోత్సాహం ఇస్తాను. ఇది ఎమోషనల్ జర్నీ ” అంటూ చెప్పుకొచ్చారు. సీఎస్ఆర్- అపోలో వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.. సింగిల్ మదర్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. గర్భంతో ఉన్న సమయం నుంచి డెలివరీ వరకు సాగిన జర్నీ మరచిపోలేనిదని.. ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఉపాసన చెప్పింది. ఇప్పుడు అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు చాలా ఎమోషనల్ జర్నీ అని పేర్కొంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…