Upasana Delivery : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి పండంటి బేబికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా మెగా అభిమానులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు జూన్ 20న ఉపాసన బేబికి జన్మనిచ్చింది. అయితే అపోలో ఆస్పత్రి నుండి శుక్రవారం ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఈ సందర్భంగా ఉపాసనను, తన కూతురును దగ్గరుండి ఇంటికి తీసుకుపోయాడు రామ్ చరణ్. ఆ రోజు ఉపాసన డిశ్చార్జ్ అవుతుందని తెలిసి అపోలో ఆసుపత్రికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మీడియా సైతం అక్కడ చాలా సేపటి నుండి ఎదురు చూసింది. మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ తమ బేబీ క్షేమాన్ని కోరుతూ ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఏ పేరు పెట్టాలనే విషయమై తానూ ఉపాసన ఒక నిర్ణయానికి వచ్చామన్నాడు. అయితే ఉపాసన ప్రగ్నెంట్ అయినప్పటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె డెలివరీ సజావుగా జరిగింది. ఉపాసన డెలివరీ తర్వాత అపోలో డాక్టర్ల బృందం స్పందించింది. ఉపాసన కాన్పు సందర్భంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ రూమా సిన్హా, డాక్టర్ లత కంచి పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
గర్భవతిగా ఉన్నప్పుడు ఉపాసన ఫిట్ నెస్ పరంగా, న్యూట్రిషన్ పరంగా అద్భుతమైన జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే కాన్పు సాఫీగా జరిగిందని వివరించారు. అందరు గర్భవతులు ఉపాసనలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తెలిపారు. ఉపాసన, పాపకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ సుమన మనోహర్ తెలిపారు. ఇక మనవరాలు జన్మించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి చాలా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.49 (మంగళవారం) గంటలకు ఉపాసన ఆడశిశువుకు జన్మనిచ్చిందని వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఓ బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డను మా చేతుల్లో పెట్టాలి అని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. అది ఇన్నాళ్లకి జరిగిందని చిరు సంతోషం వ్యక్తం చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…