యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తరువాత కార్తికేయ 2తో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. కార్తికేయకు సీక్వెల్గా వచ్చినప్పటికీ మొదటి పార్ట్కు, దీనికి సంబంధం లేదు. సెకండ్ పార్ట్లో కొత్త కథను చూపించారు. కథలో కొత్తదనం ఉంది. కనుక సినిమా హిట్ అయింది. ఇక హిందీ మార్కెట్లోనూ ఈ మూవీ భారీ హిట్గా నిలిచింది. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే కార్తికేయ 2 విడుదలైన ఇన్ని రోజుల తరువాత ఈ మూవీపై ఒక వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కార్తికేయ 2 మూవీ వాస్తవానికి జూలై 22నే రిలీజ్ కావల్సి ఉంది. కానీ అదే తేదీ రోజు నాగచైతన్య నటించిన థాంక్ యూ మూవీని రిలీజ్ చేశారు. అందువల్ల కార్తికేయ 2ను వాయిదా వేయాల్సి వచ్చింది. తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం కోసం కార్తికేయ 2ను ఇంకో రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కార్తికేయ 2ను నాగార్జున, నితిన్ అడ్డుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్తికేయ 2 హిట్ అవుతుందని నాగార్జునకు, నితిన్కు ముందే తెలుసని.. కనుకనే థియేటర్లను చేతిలో పెట్టుకున్న నిర్మాత దిల్ రాజుతో కలిసి కుట్ర పన్నారని.. అందుకనే కార్తికేయ 2ను అడ్డుకున్నారని అంటున్నారు. ఇక ఈ మూవీలో హీరో నిఖిల్కు తల్లిగా నటించిన తులసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇక ఇప్పుడు అడ్డుకోండి, మా సినిమాను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. అంటూ కామెంట్స్ చేసింది. దీంతో కార్తికేయ 2ను నిజంగానే నాగార్జున, నితిన్లు అడ్డుకుని ఉంటారని అంటున్నారు. అయితే దీనిపై వారు పెదవి విప్పలేదు. మరి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…