తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది ఆ పార్టీయే.. తేల్చి చెప్పిన స‌ర్వే..!

తెలంగాణ ఎన్నిక‌లు రంజుగా మార‌నున్న విష‌యం తెలిసిందే.బీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఆయన నివాసంలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వికారాబాద్‌ పట్టణం ధన్నారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలులు వీస్తున్నాయని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని వారు తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద 104ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ తరపున మద్దతు తెలిపారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సంస్థలు స‌ర్వేలు నిలుస్తుండ‌గా, తాజాగా లోక్ పోల్ అనే సంస్థ ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో కాంగ్రెస్‌దే గెలుపుగా చెబుతున్నారు.. మరోమారు తమదే అధికారమని చెబుతున్న బీఆర్‌ఎస్‌ కు లోక్‌ పోల్‌ సర్వే షాక్ ఇచ్చిన‌ట్టే అయింది.తెలంగాణలో బీజేపీ గెలుస్తుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో ఆ పార్టీ కి కేవలం 2–3 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే బాంబుపేల్చింది. మొత్తం మీద బీజేపీకి 10 నుంచి 12 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేసింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కు 45–51 మధ్య సీట్లు వస్తాయని లోక్‌ పోల్‌ సర్వే వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ కు 39 శాతం నుంచి 42 శాతం వరకు ఓట్లు లభిస్తాయని, ప్ర‌తిప‌క్షంగా ఆ పార్టీ నిలుస్తుంద‌ని టాక్.

this party will come into power in telangana next time

ఎంఐఎం పార్టీ 6–8 సీట్లకే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌క జెండా ఎగ‌ర‌వేస్తుంద‌ని స‌మాచారం. కాంగ్రెస్‌ కు 61–67 సీట్లు దక్కుతాయని సర్వే తెలప‌గా, ఆ పార్టీకి 41–44 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అంటున్నారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు పథకాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. ఈ పథకాల వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని లోక్‌ పోల్ తేల్చి చెప్పింది.ఈ స‌ర్వేతో ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మ‌రి రానున్న ఎల‌క్ష‌న్స్‌లో కాంగ్రెస్ రిజ‌ల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago