వాణిశ్రీ సినిమాలు మానేయడానికి ఆ ఒక్క సంఘటనే కారణమా..? అసలు సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగింది..?

కె. బాపయ్య  దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ కలిసి నటించిన చిత్రం ఎదురులేని మనిషి. ఈ చిత్రానికి గాను వైజయంతి మూవీస్ సమస్థ నిర్మాణ సారథ్యం వహించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ ఇంకా అప్పటినుంచి సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నారట.  వాణిశ్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల వెనుక కారణం ఏమిటి..? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఎదురులేని మనిషి చిత్రం షూటింగ్ టైంలో కృష్ణా ముకుందా మురారి అనే ఓ ఆకతాయి పాట షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణి శ్రీ గారు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా.. ఆ డాన్స్ మూమెంట్స్  చూస్తుంటే నాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. కాస్త మీరేనా ఆ డైరెక్టర్ ని పిలిచి చెప్తే బాగుంటుంది కదా అని అన్నారట.

this is the reason why vani sri stopped doing films

ఎన్టీఆర్ వెంటనే నేను చెప్పను వాణిశ్రీ గారు అని అన్నారట. అదేంటండీ అలా అంటున్నారు అని ప్రశ్నించారట వాణిశ్రీ. దానికి ఎన్టీఆర్ ఇది ఇప్పటి ట్రెండ్.   అది తప్పో ఒప్పో చెప్పడానికి మనం ఎవరిమండి అది నిర్మాతల ఇష్టం. మనం నటించమని చెప్పేస్తే వేరే ఎవరినైనా పెట్టి సినిమా తీసేసుకుంటారు వాళ్ళు. డబ్బులు పెట్టేది నిర్మాతలు గనుక ఎలా తీస్తే లాభం వస్తుంది అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది.

ఒక సినిమాలో  నటించేటప్పుడు నిర్మాతల నిర్ణయాలను మనం కాదనలేము. కాబట్టి మన ముందున్న దారులు రెండే రెండు. ఒకటి నచ్చకపోతే పూర్తిగా సినిమా వదిలేసి వెళ్లిపోవడం. లేకపోతే సర్దుకుపోయి నటించడం. నాకు తెలిసి ప్రస్తుతం మనం రెండోదారి ఎంచుకోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం వాణిశ్రీ గారు అన్నారట ఎన్టీఆర్. మీరు ఒక్కమాట చెబితే వాళ్ళు నిర్ణయాన్ని  మార్చుకుంటారేమో అని మరోసారి చెప్పారట వాణిశ్రీ.

వాణిశ్రీ ప్రశ్నకు సమాధానంగా నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో కాబట్టి వారు చెప్పినట్టు నటించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశాను. కాబట్టి వాళ్లు చెప్పినట్లు ట్రెండ్ ఫాలో అవ్వడం మంచిది అని చెప్పారట. వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది అని మరింత వివరణ కూడా ఇచ్చారట. ఇక ఎన్టీఆర్ వివరణ పూర్తయిన తర్వాత  వాణిశ్రీ ఆలోచనల్లోకి వెళ్లారట. ఇక సినిమాలు మానేయడమే బెటర్ అనే అభిప్రాయానికి ఆమె రావడానికి ఆ సంఘటనే కారణమయ్యిందట. అయితే ఈ విషయాలు వాణిశ్రీ గారే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Share
Mounika Yandrapu

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

11 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago