Kalki 2898AD : టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా కల్కి 2898 ఏడి. మరికొద్ది గంటలలో ఈ సినిమా విడుదల కానుంది. సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పడుకొనే, దిశా పటాని, మాళవిక నాయర్ నటించారు. సీనియర్ నటులు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ దత్ నిర్మాతగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఇటీవల సినిమా నుంచి కల్కి థీమ్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. కాల భైరవ మరొకసారి తన వాయిస్ తో ఆకట్టుకున్నాడు.
రిలీజ్ కు ముందు.. మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేయడంతో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోజుకు ఐదు షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అలానే పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 5.30 గంటలకు స్పెషల్ వేసుకునేందుకు జీవో జారీ చేసింది. కాగా.. కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ పడతాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5.30 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పుడు కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ వేయకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
అర్థరాత్రి షోస్ వేస్తే ఎక్కువ మంది యువకులే థియేటర్లకు వస్తారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు.. మద్యం సేవించి వచ్చి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారని కొందరు చెబుతున్నారు. కాబట్టి మిడ్ నైట్ షోస్ వేయకపోవడం బెటర్ అని అంటున్నారు. కల్కి సినిమా.. భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ తెరకెక్కగా, ఈ సినిమాని మిడ్ నైట్ చూశాక కొందరికి ఏమైనా చిన్న విషయం అర్థం కాకపోయినా సరే.. సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసేస్తారు. దీంతో ఆ పోస్టులు సినీ ప్రియులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి పొద్దున్న ఫ్రెష్ మైండ్ తో సినిమా చూస్తే ఈజీగా క్లారిటీగా అర్థమవుతుందని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ బాహుబలి మూవీకి కూడా అర్థరాత్రి నెగెటివ్ రివ్యూలు వచ్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…