OTT : బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో కూడా వైవిధ్యం చూపించి తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు ఆయన తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా ‘మహారాజ్’. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల చేయకూడదని చాలా మంది ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. ఎట్టకేలకి ఈ చిత్రం విడుదల కాగా, ఈమూవీ జూన్ 21న నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ‘మహారాజ్’ సినిమా చూడాల్సిందిగా నిర్మాత జడ్జిని అభ్యర్థించారు.
ఈ పిటిషన్కు అంగీకరించిన న్యాయమూర్తి.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఇందులో లేవని సినిమా చూసిన తర్వాత చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.అయితే స్ట్రీమింగ్కు వచ్చిన ఐదు రోజుల్లోనే అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మహారాజ్ చిత్రంపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం తమ మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకంగా ఉందని, రిలీజ్ ఆపాలని ఓ హిందూ సంఘం పిటిషన్ వేయడంతో జూన్ 14న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా జూన్ 21న స్ట్రీమింగ్కు వచ్చింది.
బాలీవుడ్లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ సంస్థ ‘మహారాజ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. జునైద్ ఖాన్కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో ‘పాతాల్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్రలో నటించారు. కాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు మహారాజ్ సినిమాలో ఉన్నాయని కొందరు కేసు పెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తెరంగేట్రం చేశారు. ‘మహారాజ్’ అనే పీరియాడిక్ బయోపిక్ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1800ల బ్యాక్డ్రాప్తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కరందాస్ ముల్జీ జీవితంపై ఈ చిత్రం తెరకెక్కింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…