మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఇది ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ను మన దేశంలోనూ పండిస్తున్నారు. దీన్ని చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. పైన తొడిమలు ఉంటాయి. లోపల తెల్లగా నల్లని విత్తనాలను కలిగి ఉంటుంది. ఇది భలే రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్ను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ బరువు తగ్గాలనుకునేవారికి ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండ్లలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఈ పండ్లలో ఉండే మెగ్నిషియం మనసును ప్రశాంతంగా మారుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
ఈ పండ్లను తినడం వల్ల హార్ట్ ఎటాక్లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ను నేరుగా తినవచ్చు. లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కనుక దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…