జింబాబ్వేపై భార‌త్ ఘ‌న విజ‌యం.. సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో ఢీ.. మ్యాచ్ ఎప్పుడంటే..?

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వర‌ల్డ్ క‌ప్ 2022 టోర్నీ సూప‌ర్ 12 మ్యాచ్‌లో జింబాబ్వేపై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 187 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో జింబాబ్వే త‌డ‌బ‌డింది. ఆరంభం నుంచి వికెట్ల‌ను కోల్పోతూ వచ్చింది. దీంతో త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఇక జింబాబ్వేపై భార‌త్ 71 ప‌రుగుల భారీ తేడాతో బంప‌ర్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో భార‌త్ గ్రూప్ 2లో టాప్ పొజిష‌న్‌కు చేరుకుంది. ఇప్ప‌టికే సెమీస్‌కు దూసుకెళ్లిన భార‌త్.. ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా.. జింబాబ్వే ఫీల్డింగ్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్ రాణించారు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో యాద‌వ్ 61 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా.. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో రాహుల్ 51 ప‌రుగులు చేశాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో విలియ‌మ్స్ 2 వికెట్లు తీయ‌గా.. రిచ‌ర్డ్ ఎన్‌గ‌ర‌వ‌, బ్లెస్సింగ్ ముజ‌ర‌బ‌ని, సికంద‌ర్ రాజాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

t20 world cup 2022 india won by 71 runs against zimbabwe

అనంత‌రం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.2 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయింది. 115 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ల‌లో ర్యాన్ బ‌ర్ల్ 35 ప‌రుగులు, సికంద‌ర్ రాజా 34 ప‌రుగులు చేశారు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మి, హార్దిక్ పాండ్యాలు చెరో 2 వికెట్లు తీశారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, అర్ష‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

ఈ మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ గ్రూప్ 2లో టాప్ జ‌ట్టుగా నిలిచింది. దీంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్ ఈ నెల 10వ తేదీన గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. అడిలైడ్ మైదానంలో మ్యాచ్ నిర్వ‌హిస్తారు. ఇక సెమి ఫైన‌ల్ 1లో న్యూజిలాండ్‌, పాక్‌లు త‌ల‌ప‌డ‌తాయి. ఈ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన బుధ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు జ‌రుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌కు తోడు ఫైన‌ల్ మ్యాచ్‌కు కూడా రిజ‌ర్వ్ డే ఉంది. వ‌ర్షం కార‌ణంగా ఆట నిలిచిపోతే మ‌రుస‌టి రోజు ఆట‌ను కొన‌సాగిస్తారు. ఇక సెమీస్ లో గెలిచిన జ‌ట్లు ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్‌లో ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తాయి. ఈ మ్యాచ్ కూడా మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు కొన‌సాగుతుంది.

Share
editor

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago