Shruti Haasan : కమల్ గారాలపట్టి శృతి హాసన్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. సినిమాల కన్నా ఈ అమ్మడు ఇతర విషయాలతో ఎక్కువగా వార్తలలో ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసున్న ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తుంటుంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఇన్డైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా తన ప్రియుడిని దగ్గరికి పిలిచి ముద్దాడింది శ్రుతి. ఆ వెంటనే అతను కూడా శ్రుతికి తిరిగి కిస్ ఇచ్చి వెళ్లిపోయాడు.
జియో వరల్డ్ ప్లాజా లాంచ్లో ఈ ఇద్దరు అలా ముద్దులు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. చూస్తుంటే ఈ అమ్మడు త్వరలోనే శాంతనుని వివాహం చేసుకోనుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శాంతను, శృతి హసన్ వీడియో వైరల్గా మారాయి.ఇక శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల అయి మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. దీంతో శృతి హాసన్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఓ వైపు యంగ్ హీరోలతో జతకడుతూనే మరోవైపు సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది.
ఇటు తెలుగు, అటు తమిళ్ లోనూ నటిస్తూ బిజీ బిజీ గా ఉంటోంది. వీటితో పాటు భారీ ప్రాజెక్టుల్లోనూ భాగం అవుతోంది. ‘కెజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలోనూ నటిస్తోందని టాక్. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. సినిమాల విషయంలో ఇంత ప్రొఫెషనల్ గా ఉండే శృతి హాసన్ పర్సనల్ లైఫ్ ను మాత్రం హ్యండిల్ చేయడంలో శృతి తప్పుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…