మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఇదే విషయమై పాక్ మీడియా కోడై కూస్తోంది. అక్కడి నెటిజన్లు కూడా ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. అందుకనే విడాకులు తీసుకోబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం పాక్ మీడియాలో ఈ వార్త సెన్సేషనల్గా మారింది. ఈ క్రమంలోనే వారు ఇటీవల పెట్టిన పోస్టులే అందుకు సాక్ష్యమని కూడా చెబుతున్నారు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్లది ప్రేమ వివాహం. వీరు 2010లో వివాహం చేసుకోగా.. ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఇటీవలే తమ కుమారుడి బర్త్ డే వేడుకలను కూడా వీరు గ్రాండ్గా నిర్వహించారు. ఈ క్రమంలో ఆ ఫొటోలను షోయబ్ మాలిక్ షేర్ చేశాడు. కానీ సానియా మీర్జా షేర్ చేయలేదు. పైగా బ్రోకెన్ హార్ట్.. అంటే.. పగిలిన హృదయం ఎమోజీని సైతం షేర్ చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని తెలుస్తోంది. ఇద్దరూ విడిపోయారని.. త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.
షోయబ్ మాలిక్ ఇటీవల ఓ అమ్మాయితో చనువుగా కనిపించడం వల్లే సానియా మీర్జా అతనికి దూరమైందట. ఈ మేరకు పాక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా జరగడం వల్ల ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చి ప్రస్తుతం విడిగానే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అటు మాలిక్ కానీ.. ఇటు మీర్జా కానీ.. ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…