ఎప్పుడు చలాకీగా ఉండే సమంత ఇటీవల తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజమే అని తెలుసుకొని నిరాశ చెందారు. ఇక సమంతకు ఇలాంటి వ్యాధి సోకిందని తెలియగానే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందించారు. చిరంజీవి, ఎన్టీఆర్తో పాటు పలువురు ప్రముఖులతో పాటు అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్, సుశాంత్ కూడా స్పందించారు. అయితే నాగ చైతన్య, నాగార్జున తమ సోషల్ మీడియా వేదికగా సమంత ఆరోగ్యం గురించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఆసుపత్రికి వెళ్లి ఆమెను కలిశారని, బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పారని నెట్టింట వార్తలు పుట్టుకొచ్చాయి. ఆసుపత్రిలో చైతూకి సమంత స్వీట్ హగ్ ఇచ్చిందని కూడా కొందరు రాసుకొచ్చారు. మరి కొందరు అదంతా ఉట్టి పుకార్లేనని కొట్టి పారేస్తున్నారు. అయితే నాగార్జున.. సమంతని కలవమని నాగ చైతన్యకు సూచించాడని, బిజీ షెడ్యూల్ వలన అది కురలేదని అంటున్నారు. అయితే సమంతకు కాల్ చేసిన నాగ చైతన్య ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారట.
ఏదైన సాయం కావాలంటే అడగమని కూడా చెప్పాడట. మరి ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య గురించి మరిన్ని ఎక్కువ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా ఒకరి దగ్గర ఒకరి జ్ఞాపకాలు పదిలంగానే ఉంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలు కంప్లీట్ చేసిన సామ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తన అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని రోజులు రెస్ట్ తీసుకోనుందని తెలిసింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…