Shaakuntalam : సమంతతో పాటు ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం శాకుంతలం. గత కొన్నాళ్ల నుండి కొన్ని అనుకోని కారణాల వల్ల మేకర్స్ విడుదల తేదిని ప్రకటిస్తూ మళ్ళీ వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల అయ్యింది.. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో గ్రాండ్ గా నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో అయితే నిర్మించారు. అయితే ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. వారం కూడా గడవక ముందే ఈ చిత్రం డిజాస్టర్ అని తేల్చేసారట.
చాలా ప్రాంతాల్లో షోలు లేకపోవడంతో సినిమాను దాదాపుగా తీసేసినట్టే అని సమాచారం.. అతి త్వరలోనే మిగతా చోట్ల కూడా పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి..ఈ సినిమా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది.. దీంతో ఈ టార్గెట్ రీచ్ కాకపోవడంతో చాలా నష్టాలు వచ్చినట్టు అయితే తెలుస్తుంది.. రెండు మూడు కాదు ఏకంగా 12 నుండి 13 కోట్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం.. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.28 కోట్ల షేర్ 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అయితే తెలుస్తుంది.. మరి 19 కోట్ల టార్గెట్ ఫినిష్ చెయ్యాలంటే ఇంకా 14 కోట్ల రేంజ్ లో రాబట్టాల్సి ఉండగా, అది అసాధ్యమే అని అంటున్నారు.
శాకుంతలం చిత్రానికి ఎన్టీఆర్ పెద్ద హ్యాండ్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఎన్టీఆర్ ని గుణ శేఖర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయగా, ఈ దర్శకుడు శాకుంతలం చిత్రంలో భరతుడి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ ని అనుకున్నారట. దీని గురించి ఎన్టీఆర్తోను చర్చించగా.. తన కొడుకుని అప్పుడే సినిమాల్లో పరిచయం చేసే ఉద్దేశం లేదని తారక్ తెలిపాడట. దీనితో గుణశేఖర్ చాలా కాలం అలోచించి అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హని బాల భరతుడిగా చూపించారు. అయితే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు చేసి ఉంటే మరోఆ ఉండేదని నెటిజన్స్ భావిస్తున్నారు. ఆ రకంగా, శాకుంతలం చిత్రానికి ఎన్టీఆర్ పెద్ద షాకే ఇచ్చాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…