దొంగలు అంటేనే ఎవరీ కంటపడకుండా దొంగతనం చేస్తారు. విలువైన వస్తువులను, నగదును క్షణాల్లో దోచుకుంటారు. దొంగతనం జరిగినట్టు కూడా మనకు తెలియదు. అంత స్మార్ట్ గా దోచుకుంటారు దొంగలు. ఆ రకంగానే ఓ వృద్ధురాలు కూడా జ్యువెలరీ షాపులోకి ప్రవేశించి స్మార్ట్ గా గోల్డ్ నెక్లెస్ ను అపహరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాల్దేవ్ ఫ్లాజాలోని ఓ జ్యువెలరీ షాపులోకి వృద్ధురాలి ప్రవేశించింది. నలుపు రంగు కళ్ల జోడు, ముఖానికి మాస్కు ధరించింది. ఇక బంగారం నెక్లెస్ చూపించమని షాపు సిబ్బందిని కోరింది. జ్యువెలరీని చూస్తూనే మెల్లిగా నెక్లెస్ బాక్స్ ను తన చీర కొంగు కిందకు పెట్టుకుంది. అయితే, నెక్లెస్ను దొంగిలించడానికి మహిళలు కేవలం 20 సెకన్ల సమయమే తీసుకున్నందున నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అనంతరం ఏమీ తెలియని ఇంకో జ్యువెలరీ బాక్సును సిబ్బందికి ఇచ్చింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగు తీసుకొని, కొంగు కిందే నెక్లెస్ బాక్సును పెట్టుకుని షాపు నుంచి బయటకు జారుకుంది. ఈ ఘటన నవంబర్ 17న జరగ్గా, ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ నెక్లెస్ విలువ రూ. 10 లక్షలు ఉంటుందని షాపు యజమాని పేర్కొన్నాడు. జ్యువెలరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ వృద్ధురాలు అంత చాకచక్యంగా నగలు కొట్టేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…