Samantha : సమంత, నాగ చైతన్య టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్గా ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. ఈ జంటని చూసి ఎంతో మంది మురిసిపోయారు. ఇలా అందరు ఉండాలని అనుకున్నారు. కాని ఊహించని విధంగా విడిపోయారు. 2021 అక్టోబర్ 2న వీరిద్దరు విడాకులు తీసుకోగా, వారి విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. వారు విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు.
సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు. అయితే
ఇదిలా ఉండగా చైతు మే 12న తన కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా చైతు ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సమంత చాలా మంచి వ్యక్తి అని ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నట్లు చైతు తెలిపాడు. విడిపోయినప్పటికీ మా ఇద్దరి మధ్య గౌరవ సంబంధాలు ఉన్నాయని చైతు తెలిపాడు. అయితే మా ఇద్దరి మధ్య పగ ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు.
అయితే సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘మనమంతా ఒక్కటే.. కేవలం ఇగోలు, నమ్మకాలు, భయాల వల్లే విడిపోయాం’అని ఉన్న కొటేషన్ ని సమంత షేర్ చేసింది. అంటే చైతు, సమంత ఇగో ఫీలింగ్ వల్లే విడిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. చైతుతో విడిపోవడం వల్ల సమంత అనేక నిందలు ఎదుర్కొన్నవిషయం తెలిసిందే. సమంత చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసేలా కనిపిస్తున్నాయి. అసలు వీరు విడిపోవడం వెనక కారణం ఎప్పుడు చెబుతారో ఏంటో మరి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…