Anasuya : సోషల్ మీడియాలో అనసూయని, వివాదాల్ని వేరు చేసి చూడలేం. బోల్డ్ గా ఉండడం ఆమె స్టయిల్. ఇటీవలి కాలంలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు, అనసూయకు మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ నటి మరోసారి వివాదాస్పదమైంది. రీసెంట్గా ఖుషి సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఆ పోస్టర్ లో ‘ది దేవరకొండ’ అని వేశారు. సాధారణంగా పేరు రాస్తే సరిపోతుంది. కానీ ముందు ఇలా ‘ది’ అనే అక్షరాన్ని చేర్చారు. దీన్ని అనసూయ పట్టుకుంది. పైత్యం ఎక్కువైందని, అది మనకు అంటకుండా జాగ్రత్త పడాలని ట్వీట్ చేసింది.
అనసూయ ట్వీట్ వేసిన వెంటనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అనసూయపై మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎప్పటి మాదిరిగానే ఆంటీ అనే సంభోదనను తెరపైకి తెచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఈసారి అసూయఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. దాంతో అనసూయ.. . `భలే అంటున్నార్రా దొంగ ఊప్స్.. బంగారు కొండలంట, ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తునే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు` అని పేర్కొంది. అనసూయ డైహార్డ్ ఫ్యాన్స్ ట్విట్టర్ నుంచి ఆమెని బూతులతో తిడుతున్న పోస్ట్ కి కూడా ఈమె రిప్లై ఇచ్చింది.
అలానే స్టార్ హీరోలని ఉద్దేశించి కూడా ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.. ఫ్యాన్స్ విషయంలో హీరోలు ఎందుకు జోక్యం చేసుకోరనేది ఆమె ప్రశ్నిస్తుంది. `ఈ స్టార్స్ అంతా తమ ఫ్యాన్స్ పేరుతో ఎలాంటి తప్పు చేసినా నిలదీయడానికి ఏం ఆపుతుందో అర్ధం కావడం లేదు. గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది. నాకిచ్చిన పవర్లో నేను బాధ్యత వహిస్తున్నా, అభిమానులు, ఫాలోయింగ్ పోతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్ కదండీ` అంటూ మరో ట్వీట్ వదిలి హాట్ టాపిక్గా మారింది అనసూయ. ఈ అమ్మడి ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…