భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఇటీవల భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరపైకి తీసుకురావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ అంచనాలని తలకిందులు చేసింది లైగర్. తొలి రోజే నెగెటివ్ టాక్ ను మూటగట్టుకొని బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ ను రాబట్టింది.
మొదటిరోజు రూ.9.57 కోట్లు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రెండవ రోజు కేవలం రూ.1.54 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక మూడవరోజు కోటి రూపాయల షేర్, నాలుగో రోజు రూ.58 లక్షల షేర్ రాగా 5వ రోజు మాత్రం మరింత దారుణంగా కేవలం రూ.12 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఆచార్య తర్వాత అంత దారుణమైన ఫ్లాప్ చిత్రంగా లైగర్ చిత్రం నిలిచింది. భారీ హైప్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం దారుణంగా విఫలం కావడంతో నెటిజన్స్తోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ లైగర్ సినిమా ట్రోలింగ్ నుండి సమంత తప్పించుకుంది.
సాధారణంగా సమంత తన తోటి స్నేహితులు, కో ఆర్టిస్ట్ సినిమాలకి ఫ్రీ ప్రమోషన్ చేస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా సినిమాని చూడమని కోరుతుంది. అయితే లైగర్ విషయంలో సమంత ఆ పని చేయలేదు. ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఒకవేళ లైగర్పై ఏదైనా ట్వీట్ చేసి ఉంటే దారుణమైన ట్రోల్స్కి గురై ఉండేది. కాగా, సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి రీసెంట్ గా ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం లేదు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకునే సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీంతో సమంత ఎందుకు ఇలా మారిందని పెద్ద చర్చ జరుగుతోంది. అయితే సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం శిక్షణలో ఉన్న కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…